భార్యను రాకుండా ఆపిన లాక్‌డౌన్‌.. మనస్తాపంతో భర్త సూసైడ్

భార్యను రాకుండా ఆపిన లాక్‌డౌన్‌.. మనస్తాపంతో భర్త సూసైడ్

యూపీ: లాక్ డౌన్ కారణంగా భార్య వాళ్ల అమ్మ గారింట్లోనే ఉండిపోవటంతో తట్టుకోలేక ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన యూపీలోని గొండలోని రాధ్ కుంద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాకేష్ సోని (32) అనే వ్యక్తి గొండలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లాక్ డౌన్‌కు ముందు పుట్టింటికి వెళ్లింది. తిరిగి వద్దామనుకునే లోపే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించేశారు. దీంతో ఆమె తిరిగి భర్త దగ్గరకు రాలేకపోయింది. భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు రాకేష్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రెండు వారాలుగా భార్య లేకపోవటంతో రాకేష్ మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.