డాక్టర్ల నిర్లక్ష్యం.. వైద్యం అందక మహిళ మృతి

డాక్టర్ల నిర్లక్ష్యం.. వైద్యం అందక మహిళ మృతి

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సరైన ట్రీట్ మెంట్ అందక  ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ములుగు ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల లాస్య అనే మహిళ.... ఊపిరితిత్తులలో నీరు చేరిందని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిందన్నారు ఆమె బంధువులు. డాక్లర్లు నిర్లక్ష్యం కారణంగానే లాస్య చనిపోయిందని ఆరోపిస్తూ హాస్పీటల్ ఎదుటు ధర్నా చేశారు బందువులు.  లాస్య మృతికి గల కారణాలను వైద్యులు చెప్పడం లేదని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.