108 వాహనంలో ప్రసవం

108 వాహనంలో ప్రసవం

కీసర, వెలుగు: కీసర మండల పరిధిలో రాంపల్లి దాయర ఇందిరమ్మ కాలనీలో నివసించే భవాని (25) శనివారం108లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఇందిరమ్మ కాలానికి చెందిన భవాని శనివారం పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆమె బంధువులు108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కీసర108 ఈఎంటీ రానిల్ రెడ్డి, పైలెట్ వీరన్న మహిళను108లో గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రానిల్ రెడ్డి మెట్టుగూడకు చేరుకోగానే వాహనం పక్కన నిలిపి సమయస్ఫూర్తితో సుఖప్రసవం జరపడంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తల్లి బిడ్డను తీసుకెల్లగా వైద్యులు తల్లి బిడ్డను పరీక్షించి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.