తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను అందిస్తామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇన్ఫెక్షన్ డిసీజ్లో ఎక్స్ ఫర్ట్స్ డాక్టర్లతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్, చికిత్స అందిస్తున్న డాక్టర్స్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారిలో జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారన్నారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలని సూచించారు. యాంటీ వైరల్ మందుల కంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయన్నారు. సీటీ స్కాన్ తో ఉపయోగం లేదని…ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చన్నారు మంత్రి ఈటల.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్లు పాల్గొని ఆస్పత్రుల డాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.