కార్తీక శనివారం..యాదాద్రికి పోటెత్తిన భక్తులు

కార్తీక శనివారం..యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక శనివారం కావడంతో..భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ తిరువీధులు భక్తులతో నిండిపోయాయి.

శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట పడుతుంది. కొండ కింద జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.