
గోదావరిఖని, వెలుగు: బీటెక్లో బ్యాక్ లాగ్స్క్లియర్చేయలేకపోతున్నాననే బాధతో పెద్దపల్లి జిల్లాలో ఓ యువకుడు సూసైడ్చేసుకున్నాడు. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన బర్కం రవిశంకర్ స్థానికంగా జిరాక్స్సెంటర్ నిర్వహిస్తుంటాడు. ఇతని కొడుకు బర్కం చరణ్తేజ(24) హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్చదివాడు. తోటి స్టూడెంట్లు అంతా రెండేళ్ల కిందనే చదువు పూర్తిచేయగా, చరణ్తేజ సబ్జెక్టులు క్లియర్ కాలేదు. ఇంటి వద్దే ఉంటూ ఎగ్జామ్స్ కు ప్రిపేర్అవుతున్నాడు. బ్యాక్లాగ్స్విషయంలో కొంత కాలంగా బాధపడుతున్న చరణ్తేజ గురువారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నాడు. జిరాక్స్ సెంటర్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి రవిశంకర్.. చనిపోయిన కొడుకును చూసి బోరున విలపించాడు. ఆయన ఫిర్యాదుతో గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై సమ్మయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.