జైపూర్ ఎయిర్ పోర్టులో రూ. 24 లక్షల గోల్డ్ సీజ్

జైపూర్ ఎయిర్ పోర్టులో రూ. 24 లక్షల గోల్డ్ సీజ్

రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా  5 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని ట్రిమ్మర్‌లో దాచి షార్జా నుంచి తెచ్చాడు ప్రయాణికుడు. వీటి విలువ రూ. 24 లక్షలకు  ఉంటుందని చెప్పారు. దీంతో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసి బంగారం సీజ్ చేశారు. కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.