మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులు స్థానిక భాషల్లోనూ బోధించాలి : అమిత్ షా

మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులు స్థానిక భాషల్లోనూ బోధించాలి : అమిత్ షా
  • ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలి
  • పరిపాలనలోనూ స్థానిక భాషనే ఎక్కువగా వాడాలి
  • ఏ ఒక్క భాషకూ హిందీ వ్యతిరేకం కాదన్న కేంద్ర హోం మంత్రి 

న్యూఢిల్లీ:  గతంలో భాష పేరిట దేశాన్ని విభజించే కుట్రలు జరిగాయని, అలాంటి కుట్రలు ఎన్నటికీ విజయం సాధించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే పవర్​ఫుల్​ సాధనంగా భారతీయ భాషలను మోదీ సర్కార్​ చూస్తున్నదని, వాటి రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. మెడికల్​, ఇంజనీరింగ్​ విద్యను స్థానిక భాషల్లోనూ బోధించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని ఆయన అన్నారు. రాష్ట్రాల పరిపాలనలోనూ లోకల్​ లాంగ్వేజెస్​కు ప్రాధాన్యం ఇవ్వాలని తద్వారా స్థానిక భాషకు మరింత గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ ఒక్క భాషకూ హిందీ వ్యతిరేకం కాదని, అన్ని భారతీయ భాషలకు హిందీ ఫ్రెండ్​ అని అన్నారు.

 ఇతర ఫారిన్​ భాషలకు కూడా హిందీ వ్యతిరేకం కాదన్నారు. గురువారం సెంట్రల్​ గవర్నమెంట్​ అఫీషియల్​ ల్యాంగ్వేజ్​ హిందీ డిపార్ట్​మెంట్​ గోల్డెన్​ జూబ్లీ వేడుకల్లో అమిత్​ షా మాట్లాడారు. ‘‘బానిస మనస్తత్వం నుంచి బయటపడటానికి సొంత భాషే మార్గం. ఒక వ్యక్తి సొంత భాషలో మాట్లాడకపోతే బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందలేడు. భాష  సమాచార మాధ్యమం మాత్రమే కాదు.. అది జాతి ఆత్మను చాటుతుంది. ఏ భాషపైనా వ్యతిరేకత వద్దు. అన్నిటినీ గౌరవించాలి. పరిపాలన సొంత భాషలో జరగాలన్న లక్ష్యంతోనే అఫీషియల్​ లాంగ్వేజ్​  డిపార్ట్​మెంట్​ ఏర్పడింది” అని వివరించారు. 

స్థానిక భాషలకు ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో లోకల్​ లాంగ్వేజెస్​ను  ఎక్కువగా వాడాలని, ఇందుకోసం రాష్ట్రాలకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రం అందిస్తుందని అమిత్ షా చెప్పారు.  జేఈఈ, నీట్​, సీయూఐటీ వంటి పరీక్షలు ఇప్పుడు 13 భాషల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్​ పోస్టుల రిక్రూట్​మెంట్​ టెస్ట్​లు కూడా 13 భాషల్లో నిర్వహిస్తున్నామని, గతంలో హిందీ లేదా ఇంగ్లిష్​లోనే జరిపేవారని పేర్కొన్నారు. 95 శాతం మంది అభ్యర్థులు మాతృభాషలోనే ఎగ్జామ్​ రాసి విజయం సాధిస్తున్నారని తెలిపారు.

 కాగా,  డ్రగ్స్​ జోలికి వెళ్లొద్దని యువతకు అమిత్​ షా సూచించారు. గురువారం డ్రగ్స్​ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన   ట్వీట్​ చేశారు. డ్రగ్స్​ రహిత్​ భారత్​ కోసం కృషి చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.