
మైనర్ బాలికలను టార్గెట్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచక కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2020 బ్యాచ్ కు చెందిన ప్రదీప్. రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్పల్లి లో కానిస్టేబుల్గా పని చేశాడు. ప్రస్తుతం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
అయితే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న టైమ్ లో స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రదీప్ ట్రాప్ చేశాడు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. అయితే ప్రదీప్ నుంచి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు తన తల్లికి విషయాన్ని చెప్పేసింది. ఈ క్రమంలో తన తల్లి సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
షీ టీమ్స్ సాయంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రదీప్ పనిచేసిన ప్రతి చోట ఇలాంటి వ్యవహారాలే ఉండటంతో ఉన్నాతాధికాలు ప్రదీప్ పై సీరియస్ అవుతున్నారు. అతని ఫోన్ లో కూడా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉండటంతో ఖంగుతిన్నారు.