హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు

హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు

హుజురాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారన్నారు...MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. వంద రోజుల్లో సంపూర్ణంగా దళిత బంధు అమలు చేయాలని  డిమాండ్ చేశారు. లేదంటే సీఎం కేసీఆర్ ను దళిత సమాజం రాజకీయంగా బొంద పెడుతుందని హెచ్చరించారు. త్వరలో హుజురాబాద్ నియోజకవర్గం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరబాద్ వరద బాధితులను మోసం చేసిన కేసీఆర్... దళిత బంధు పథకం అమలు చేస్తారనే నమ్మకం లేదన్నారు.