సర్పంచులు, జడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు

సర్పంచులు, జడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు

హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలిచ్చింది. పంచాయతీరాజ్ కిందకు వచ్చే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం 30 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.5వేలు ఉండగా.. తాజా నిర్ణయంతో రూ.6500కు పెరిగింది. అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీల గౌరవ వేతనం రూ.10వేలు ఉండగా.. తాజా నిర్ణయంతో రూ.13వేలకు పెరిగింది.