మెహిదీపట్నం, వెలుగు : జైపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సయోద్దీన్ (40) చనిపోయాడు. కర్నాటక స్టేట్కు చెందిన సయ్యద్ సయోద్దీన్.. కొన్నేండ్ల కింద హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్కు వలస వచ్చాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుజరాతీ గల్లీలోని జబ్బార్ మొబైల్ షాప్లో సయ్యద్ పని చేస్తుండేవాడు. షాప్ ఓనర్ జబ్బార్తో కలిసి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లాడు.
హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో జైపూర్ – ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సోమవారం తెల్లవారుజామున ట్రైన్ మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటాక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. వారిలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ కూడా ఉన్నాడు.