Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్‍తో సినిమాపై అప్డేట్!

Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్‍తో సినిమాపై అప్డేట్!

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh babu) సినిమా అనే చెప్పాలి. ఈ కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుండి రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.కారణం ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడమే.

అందుకే ఈ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు.అయితే చాలా కాలం క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకామొదలవలేదు. కానీ, రాజమౌళి ఎక్కడికి వెళ్లినా అదే ప్రశ్న ఆడుగుతున్నారు ఆడియన్స్.

ఈ మేరకు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రేపు (మే 7) మీడియాతో మాట్లాడనున్నారు.బాహుబలి:క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ కోసం ఆయన ప్రమోషన్స్ చేయనున్నారు.ప్రస్తుతం రాజమౌళి ప్రొడక్షన్ లో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (Baahubali Crown of Blood) యానిమేటెడ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సిరీస్ మే 17న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

అయితే,రేపు (మే 7) మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల సమయంలో మీడియా ముందుకు రాజమౌళి రానున్నారు.ఈ ఈవెంట్ హైదరాబాద్‍లోని ఏఎంబీ సినిమాస్ వద్ద గ్రాండ్గా జరగనుంది.అంతేకాకుండా ఈ యానిమేటెడ్ సిరీస్ నుంచి ఫస్ట్ రెండు ఎపిసోడ్ల ప్రత్యేక స్క్రీనింగ్ ఉండనుంది.ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు ఇస్తారు.

ఇందులో భాగంగా మహేష్ బాబు తెరకెక్కిస్తున్న రాజమౌళి పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి వార్తను ఇవ్వబోతున్నాడో చూడాలి.  

ఇప్పటికే SSMB కథ పూర్తయినట్లు రాజమౌళి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, ప్రీ విజువలైజేషన్ పనులు జరుగుతున్నాయి.ఇక జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి..వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు.