RAW చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్​ ఫేమ్​ పరాగ్ జైన్‌

RAW చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్​ ఫేమ్​ పరాగ్ జైన్‌

రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పరాగ్​జైన్​నియమితులయ్యారు. ఆయన జూలై 1, 2025 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న రవి సిన్హా పదవీకాలం జూన్ 30, 2025తో ముగుస్తుండటంలో ఆయన స్థానంలో పరాగ్​ జైన్​ను నియమించారు. 

పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయనకు జాతీయ భద్రత, విదేశీ నిఘా రంగాల్లో పనిచేశారు.అనుభవజ్ఞుడైన అధికారి అయిన జైన్  గతంలో చండీగఢ్ SSPగా,కెనడా, శ్రీలంకల్లో భారత దౌత్య ప్రతినిధిగా పనిచేశారు. 

Centre has appointed Parag Jain, 1989‑batch IPS officer of Punjab cadre, as new Research & Analysis Wing (RAW) chief. He will succeed Ravi Sinha, whose current term concludes on June 30. Jain is set to assume office on July 1, 2025, for a fixed two‑year tenure. pic.twitter.com/hc9PuDJoKj

— ANI (@ANI) June 28, 2025

జైన్ ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతిగా పనిచేస్తున్నారు.ఇది పాకిస్తాన్ సాయుధ దళాలపై కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడం ద్వారా ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించారు. 

పరాగ్​ జైన్​ జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద నిరోధక చర్యల్లోకూడా  విధులు నిర్వహించారు. టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతంలో కేంద్రం వ్యూహానికి దోహదపడ్డారు. పరాగ్​ జైన్​ రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు.