
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించనున్నారు. మహి వి రాఘవ్ గతంలో YS రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను 'యాత్ర' పేరుతో సినిమా తీశారు. ఇప్పుడు YS తనయుడు జగన్ జీవిత ప్రస్థానాన్ని కూడా ఆయనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
జగన్ ఏపీ సీఎంగా కొద్దికాలంలోనే ఆలిండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన బయోపిక్ ను పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని భావిస్తున్నారు.