సర్వాయి పాపన్న స్పూర్తితో ప్రగతి భవన్ ను వణికించాలి

సర్వాయి పాపన్న స్పూర్తితో ప్రగతి భవన్ ను వణికించాలి

ప్రాజెక్టులు మీకు, గొర్రెలు మాకు.. పట్టు చీరలు మీకు, బతుకమ్మ చీరలు మాకు అనే కాలం ఇక చెల్లదన్నారు బీఎస్పీనేత  RS  ప్రవీణ్ కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన..భౌమని సుల్తానుల నుంచి భువనగిరి కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులం మనం అని తెలిపారు. కిలాశాపురం నుంచి గోల్కొండ వరకు జయించి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి పాపన్న మన బహుజనులపైన ఒక పెద్ద బాధ్యత మోపారని చెప్పారు. సర్వాయి పాపన్న స్పూర్తితో మనం ప్రగతి భవన్ ను గడగడలాడించాలని సూచించారు.

భూస్వాములపై పోరాటం సలిపిన బెల్లి లలిత హత్య చేయబడ్డ ఈ గడ్డమీదనే మన భహుజనులంతా ఏకం కావాలన్నారు ప్రవీణ్ కుమార్. కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ అప్పచెప్పారని.. ఈ ప్రాజెక్టులో ఎంతమంది బహుజన కాంట్రాక్టర్లు ఉన్నారు.. ఎంతమంది ఉపాధి పొందుతున్నారని ప్రశ్నించారు. మీరు కాళేశ్వరం తో ప్రజలను మభ్య పెడుతూ పబ్బం గడుపుతున్నారూ.. అదే మేము అంబేద్కర్ చూపిన జ్ఞానేశ్వరంతో నీ లెక్క చూస్తామని తేల్చి చెప్పారు. మీ గిఫ్టులు లేకపోయినా, డబుల బెడ్ రూమ్ లు లేకపోయినా బతికినం.. కానీ మేము అడిగింది చదువు దానికి తగ్గ ఉపాధి అని అన్నారు.

వాసాల మర్రి దావత్ పెట్టి మూడు కోట్లు దావత్ ఇచినవ్..76 కుటుంబాలకు దలిత బంధు ఇచ్చినవ్.. కానీ తెలంగాణ లో లక్షా 50 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఎలా ఇస్తావంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.