
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం (మే 29) పంజాబ్ తో జరుగుతున్న క్వాలిఫయర్ 1లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. పవర్ ప్లే లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్సీబీని కోలుకోనీకుండా చేశాడు. మూడు వికెట్లు తీసి పంజాబ్ ను తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా చేశాడు.
50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినా పంజాబ్ జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉండడంతో 140-150 స్కోర్ ఊహించారు. అయితే సుయాష్ ఆ అవకాశం ఇవ్వలేదు. స్వల్ప వ్యవధిలో శశాంక్ సింగ్ (3), ముషీర్ ఖాన్ (0) వికెట్లను తీశాడు. కాసేపటికే ప్రమాదకరంగా మారుతున్న మార్కస్ స్టోయినిస్(26) ను పెవిలియన్ కు పంపించాడు. ఓవరాల్ గా మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చి మిడిల్ ఆర్డర్ లో మూడు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీఈబీ జట్టుకు తాను ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చాడు.
సయూశ్ శర్మతో పాటు హేజల్ వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్, షెఫర్డ్ సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. 26 పరుగులు చేసిన స్టోయినిస్ పంజాబ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో సయూశ్ శర్మ, హేజల్ వుడ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. యష్ దయాల్ రెండు, భువనేశ్వర్, షెఫర్డ్ చెరో వికెట్ తీశారు.
అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2025 ప్రారంభంలో తనకు హెర్నియా సర్జరీకి సహాయం చేసినందుకు సుయాష్ శర్మ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కృతజ్ఞతలు తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్ లో అసలు తాను ఆడతానని ఊహించలేదని ఈ లెగ్ స్పిన్నర్ తెలిపాడు. సుయాష్ శర్మ మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెండు సంవత్సరాల క్రితం వరకు నేను ఇంజెక్షన్లు తీసుకుంటూ క్రికెట్ ఆడేవాడిని. నా సమస్య ఏమిటో తెలియకపోవడంతో నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. RCB నన్ను సర్జరీ కోసం లండన్కు పంపింది. అక్కడ నాకు జేమ్స్ బాగా చూసుకున్నాడు.
జేమ్స్ తో పాటు అతని కుటుంబం నన్ను స్వంత వ్యక్తిలా చూసుకున్నారు. నాకు మూడు హెర్నియాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నా సర్జరీ తర్వాత నేను మొదటి మ్యాచ్ ఆడతానని కూడా ఊహించలేదు. నా సర్జరీ చాలా పెద్దది కాబట్టి మూడు లేదా నాలుగు మ్యాచ్ల తర్వాత ఆడాలని నాకు చెప్పారు. నేను ఈ ఫ్రాంచైజీకి వచ్చినందుకు నిజంగా కృతజ్ఞుడను. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాను." అని సుయాష్ RCB బోల్డ్ డైరీస్లో అన్నారు. ఆర్సీబీకి టైటిల్ తీసుకొని రావడమే తన లక్ష్యం అని చెప్పిన సుయాశ్.. జట్టును ఫైనల్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.
SUYASH SHARMA HAS 3 WICKETS IN 9 BALLS - NOW STOINIS.
— ANKITA KUMARI (@ankitajkhs) May 29, 2025
RCB DOES THE RIGHT THING 💪🏻💪🏻
RCB RCB EVERYWHERE IN THE GROUND
CONGRATULATIONS RCB 🙌🫡❤️ pic.twitter.com/IRtTl82pf4