టైగర్ ష్రాఫ్ ‘గణ్ పత్’ టీజర్ విడుదల

టైగర్ ష్రాఫ్ ‘గణ్ పత్’ టీజర్ విడుదల

మెగా బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గణ్ పత్’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. టైగర్ ష్రాఫ్ కృతి సనన్ లు జంటగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్వీన్‌, సూపర్‌ 30 మూవీలు తీసిన వికాస్‌ బహల్‌ ఈసారి యాక్షన్‌ మూవీ తీసేందుకు టైగర్‌ ష్రాఫ్‌తో జతకట్టిన విషయం తెలిసిందే.

రెండు భాగాలుగా తీస్తున్న గణ్ పత్ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టైగర్ పంచ్ లైన్ ‘‘అపున్ కో జాన్తానే గాడ్ నే బోలా ఆనే కో, తో అపున్ ఆ రె లా హై’’  బీ రెడీ అంటూ సాగే డైలాగ్ తో భారీ యాక్షన్ సన్నివేశంతో సాగుతుంది. సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో టీజర్ విడుదల సందర్భంగా టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ నా అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలలో ఇది ఒకటని.. సవాల్ విసిరే ప్రాజెక్టు అని పేర్కొన్నాడు. టైగర్ ష్రాఫ్ సరసన కీర్తి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.