డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి.. లారీ కింద పడి యువకుడి మృతి

డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి..  లారీ కింద పడి  యువకుడి మృతి

జీడిమెట్ల, వెలుగు: డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి.. బైక్ స్కిడ్ కావడంతో లారీ కింద పడి యువకుడు చనిపోయిన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వరావు  తెలిపిన వివరాల ప్రకారం...  కరీంనగర్​కు చెందిన బి. పవన్​కుమార్(21), మనుదీప్ (22) సిటీకి వచ్చి కుత్బుల్లాపూర్ పరిధి మల్లంపేటలో ఉంటూ బీటెక్ చదువుతున్నారు. సోమవారం వీరిద్దరు బైక్​పై మల్లంపేట నుంచి షాపూర్ నగర్ వైపు వెళ్తున్నారు.

కైసర్ నగర్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎంను పవన్​కుమార్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో బైక్ డీసీఎంకు తగిలి ఇద్దరూ కిందపడ్డారు. అదే టైమ్​లో అటుగా వచ్చిన టిప్పర్ లారీ పవన్​కుమార్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మణిదీప్ తీవ్రంగా గాయపడగా.. అతడిని హాస్పిట
ల్​కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.