జీడిమెట్ల, వెలుగు: డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయి.. బైక్ స్కిడ్ కావడంతో లారీ కింద పడి యువకుడు చనిపోయిన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్కు చెందిన బి. పవన్కుమార్(21), మనుదీప్ (22) సిటీకి వచ్చి కుత్బుల్లాపూర్ పరిధి మల్లంపేటలో ఉంటూ బీటెక్ చదువుతున్నారు. సోమవారం వీరిద్దరు బైక్పై మల్లంపేట నుంచి షాపూర్ నగర్ వైపు వెళ్తున్నారు.
కైసర్ నగర్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎంను పవన్కుమార్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో బైక్ డీసీఎంకు తగిలి ఇద్దరూ కిందపడ్డారు. అదే టైమ్లో అటుగా వచ్చిన టిప్పర్ లారీ పవన్కుమార్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మణిదీప్ తీవ్రంగా గాయపడగా.. అతడిని హాస్పిట
ల్కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.