అమ్మవారి ప్రసాదాలు: శెనగపప్పు పాయసం.. బెల్లం అన్నం.. జస్ట్ పదే పది నిమిషాల్లో తయారీ..!

అమ్మవారి  ప్రసాదాలు:  శెనగపప్పు పాయసం.. బెల్లం అన్నం.. జస్ట్ పదే పది నిమిషాల్లో తయారీ..!

శ్రావణ మాసం అంటేనే... ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. మరీ ముఖ్యంగా అమ్మవారికి ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీ.   చాలా మంది వర్కింగ్​ ఉమెన్స్​ప్రసాదాలను తయారు చేసేందుకు సమయం లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓ పక్క ఆఫీసుల్లో సెలవు దొరక్క.. మరోపక్క ఆచారాలతో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. అలాంటి వారు జస్ట్​ పదే పది నిమిషాల్లో ఎంతో రుచికరమైన  శెనగపప్పు పాయసం.. బెల్లం అన్నం ప్రసాదాలను త వెరైటీగా  తయారు చేసుకోవచ్చు.  ఇప్పుడు ఆ   ప్రసాదాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. 

శెనగపప్పు పాయసం​ ప్రసాదం తయారీకి కావలసినవి

  • శెనగపప్పు: ముప్పావు కప్పు
  • పాలు : ముప్పావు కప్పు
  • బెల్లం తురుము: ఒక కప్పు
  • ఎండు కొబ్బరి ముక్కలు : ఒక టేబుల్​ స్పూన్​ ( కావాలంటే)
  • జీడిపప్పు, కిస్మిన్: ఒక్కోటి అర టేబుల్ స్పూన్ చొప్పున
  • నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు

 శెనగపప్పు పాయసం తయారీ విధానం

 

  •  స్టవ్​ పై పాన్​ పెట్టి  శెనగపప్పుని వేగించాలి. 
  •  వేగించిన పప్పులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో నాలుగు విజిళ్లు వచ్చే వరకు ఉడికించాలి. 
  •  పప్పుగుత్తితో మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బాలి.
  •  స్టవ్ పై ఒక గిన్నె పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి.
  • అందులో రుబ్బిన శెనగపప్పు, ఇలాచీ పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి. 
  •  నెయ్యిలో వేగించిన కిస్మిస్, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆపేయాలి.
  • అంతే శెనగపప్పు పాయసం​ రడీ.. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తరువాత మనం తినాలి.  ఇది ఎంతో టేస్టుగా ఉంటుంది.

బెల్లం అన్నం తయారీకి కావలసిన పదార్ధాలు 

  • బియ్యం - ఒక కప్పు
  • పెసరపప్పు - అరకప్పు
  • నెయ్యి - మూడు స్పూనులు
  • బెల్లం - అరకప్పు
  • పాలు - ఒక కప్పు
  • జీడిపప్పులు - ఆరు
  • కిస్ మిస్​ - పది
  • యాలకుల పొడి - అరస్పూన్​

బెల్లం అన్నం తయారీ విధానం

  • బియ్యాన్ని, పెసరపప్పును అరగంట  నానబెట్టాలి. 
  • స్టవ్​ వెలిగించి  ఈ రెండింటిని కుక్కర్​ లో మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత కుక్కర్​ మూత తీసి పెద్ద గరిటతో బాగా కలపాలి. 
  • సన్నటి మంటపై బియ్యం .. పెసరపపప్పు మిశ్రమం ఉంచి అందులో తురిమిన బెల్లం యాలకుల పొడి వేసి బాగా కలపాలి. 
  • ఆ మిశ్రమంలో బెల్లం కరిగిన తరువాత కాచిన పాలను పోసి.. దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి. 
  • నెయ్యిలో కిస్​ మిస్​.. జీడిపప్పు వేయించి కలుపుకోవాలి. 
  •  స్టవ్​ పై నుంచి దించే ముందు రెండు స్పూనుల నెయ్యి వేసుకోవాలి. అంతే బెల్లం–అన్నం ప్రసాదం రడీ.
  • అమ్మవారికి ఈ ప్రసాదం చాలా ఇష్టం.  ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి.. మనం తిన్న తరువాత.. చుట్టు పక్కల వారికి పంచిపెడితే సంపద వృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | జ్యోతిష్యం: శ్రావణ శనివారం నియమాలు..శని బాధలు తొలగుతాయి.. అనుకున్న పనులు ఇట్టే జరుగుతాయి..!