హైదరాబాద్, వెలుగు: దసరా పండగ నేపథ్యంలో ప్యాసింజర్లకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ రేట్ లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీ మధ్యలో అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ కు ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే డిస్కౌంట్ వస్తుందని తెలిపింది.
ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎండీ సజ్జనార్ సూచించారు.