- ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్ గఢ్ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది నక్సల్స్ మరణించారు. పోలీసులు కూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం కాల్పులకు దిగారు. కొన్ని గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది నక్సల్స్ మరణించారని జీజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ తెలిపారు. 11 గన్స్, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
SP Bijapur Mohit Garg: 10 Naxals neutralised in an encounter with STF & DRG in Bijapur, 11 weapons recovered #Chhattisgarh pic.twitter.com/OxmHGGpcmL
— ANI (@ANI) February 7, 2019