
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారని కోల్కతాలోని రాజ్భవన్లోని ఓ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. కోల్కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదులో తెలిపింది.
అయితే ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కల్పిత కథనాల్ని చూసి తాను భయపడనన్నారు. చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారిష్టమన్నారు. రాష్ట్రంలో అవినీతి, హింసపై తన పోరాటాన్ని ఎవనరూ ఆపలేరని చెప్పారు.
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంపై సోషల్ మీడియాలో తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది. గవర్నర్పై వేధింపుల ఫిర్యాదు అందిందని కోల్కతా పోలీస్ డిసి (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ తెలిపారు.