మేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించాం : మంత్రి సీతక్క

మేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించాం : మంత్రి సీతక్క

మేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించామని మంత్రి సీతక్క అన్నారు. కోటి మంది భక్తులోచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసకున్నామని చెప్పారు. వనదేవతలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జాతరకు రవాణా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈసారి 6 వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. గతం కంటే ఈ సారి క్యూలైన్లు పెంచామని తెలిపారు.
  
జాతరకు దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని సీతక్క తెలిపారు. మేడారం జాతరను జాతీయ స్థాయి జాతరగా తీర్చిదిద్దుతామని అన్నారు.  ప్రతి వారం జాతర పై రివ్యూ చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. మేడారంకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.  ఆర్టీసీ బస్సుల పార్కింగ్ కు 25 ఎకరాల భూమి కేటాయించామని మంత్రి సీతక్క చెప్పారు.