రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  1,050  కరోనా కేసులు  నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.  వైరస్ తో 24 గంటల్లో  నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,736 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713 కి చేరిందని.. ఇప్పటివరకు 2,38,908 మంది డిశ్చార్జ్ అయ్యారంది. మృతుల సంఖ్య మొత్తం 1,401 కి చేరిందని. ప్రస్తుతం 16,404 మంది కరోన ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా..వారిలో 13,867 మంది హోంక్వారంటైన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 232 కరోనా కేసులు నమోదయ్యాయని.. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 75 కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ.