
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920, శుక్రవారం 985, శనివారం ఏకంగా 1087మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోనే 888 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37 మందికి సోకగా ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైనా వారి సంఖ్య 243కు చేరుకుంది.