రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు

రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920, శుక్రవారం 985, శనివారం ఏకంగా 1087మందికి  వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే 888 కేసులు నమోదైనట్టు హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. రంగారెడ్డిలో 74, మేడ్చల్‌‌ లో 37 మందికి సోకగా ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైనా వారి సంఖ్య 243కు చేరుకుంది.