
తెలంగాణలో కొత్తగా నిన్న( శనివారం) 1102 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 91,361కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 693 కు చేరింది. నిన్న నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 234, కరీంనగర్ లో 101 ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే 1930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 68,126కు చేరింది. ఇంకా 22,542 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.