
హైదరాబాద్: లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రప్రభుత్వం వందేభారత్ మిషన్ను చేపట్టిన విషయం తెలిసిందు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాలకు 121 మంది భారతీయ ప్రయాణికులతో.. న్యూయార్క్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. ప్రయాణికులందరినీ పరిశీలించిన తర్వాత అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
రెండో విడత వందే భారత్ మిషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సుమారు 31 దేశాల్లో ఉన్న సుమారు 30 వేల మంది భారతీయలును 149 ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకురానున్నారు. మొదటి విడత వందే భారత్ కార్యక్రమంలో 14,800 మంది భారతీయులకు 64 ప్రత్యేక విమానాల్లో తరలించారు.