
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. మే 10లోపు విచారణకు హాజరవుతారని పోలీసులకు ప్రభాకర్ రావు తెలిపిన సంగతి తెలిసిందే. -ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. ప్రభాకర్ రావుపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ నడుస్తోంది. దీంతో.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో ప్రభాకర్ రావు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు ప్రభాకర్ రావు వచ్చారని విచారణ అధికారికి ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. విచారణ అధికారి నుంచి క్లియరెన్స్ రావడంతో అధికారులు ప్రాసెస్ మొదలుపెట్టారు. రెడ్ కార్నర్ నోటీసు ఉండడంతో విచారణ అధికారికి ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ సమాచారం ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు.. లేటెస్ట్ అప్డేట్స్:
* అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్రావు
* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్రావు
* గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా ఉండి ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు
* ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్రావు
* సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్రావు
* ఎమిరేట్స్ ఫ్లైట్లో దుబాయ్ మీదుగా హైదరాబాద్కు రాక
* సోమవారం జూబ్లీహిల్స్లోని సిట్ ముందుకు ప్రభాకర్రావు
* ప్రభాకర్రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం
* గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్కు పాల్పడ్డారన్న దానిపై విచారణ
* ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు
* రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు
* గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు
- మాసబ్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్కు సిట్ ఆఫీస్ మార్పు
- 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి పనిచేసిన సిట్
- ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్పుపై ఉత్కంఠ
- సోమవారం ఉదయం సిట్ ఎదుట హాజరుకాబోతున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు