వేములవాడ, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో 13మంది వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు, ఓ సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల ఇంక్రిమెంట్లను ఏడాది పాటు నిలుపుదల చేశారు. ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఓ నాయీ బ్రాహ్మణుడిని తొలగిస్తూ ఈవో కృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
2021లో ఆలయాన్ని విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీ చేసి, పలు విభాగాల్లో జరిగిన అవకతవకలపై నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న నివేదికపై తాజాగా చర్యలు తీసుకున్నారు.