తెలంగాణలో 132 మంది ఎమ్మార్వోలు బదిలీ

తెలంగాణలో 132 మంది ఎమ్మార్వోలు బదిలీ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల  మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి.  32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్‌లో ఉండగా పోస్టింగ్‌ ఇచ్చారు.  132 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు.   మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో ఎమ్మార్వోలను బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీజోన్‌-1లో 84 మంది, మల్టీజోన్‌-2లో 48 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా ఒకే చోట మూడేళ్లు పనిచేసేవారు.. సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని  ఎన్నికల కమిషన్  ఆదేశించింది.