రాష్ట్రంలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 1,473 కరోనా కేసులు నమోదుకాగా.. వైర‌స్ తో 8 మంది చ‌నిపోయార‌ని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 55,532కు చేరిందని.. అందులో 42,106 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతుండ‌గా.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 471గా ఉందని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 9,817 క‌రోనా టెస్టులు చేశామ‌ని తెలిపింది ఆరోగ్య‌శాఖ‌.