కారు లోయలో పడి 16 మంది మృతి

కారు లోయలో పడి 16 మంది మృతి
  • జమ్మూ​లో ఘోర రోడ్డు ప్రమాదం..
  • డోడా జిల్లాలో యాక్సిడెంట్

జమ్మూ: వేగంగా దూసుకొచ్చిన కారు మూలమలుపు వద్ద అదుపు తప్పింది.. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఏడు వందల మీటర్ల ఎత్తునుంచి కిందపడడంతో కారు ఇనుప తుక్కులా మారింది. జమ్మూ కాశ్మీర్​లో మంగళవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరు మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఆస్పత్రి బెడ్​ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మర్మాత్​లోని గౌవా విలేజ్ నుంచి క్లీనికి వెళుతుండగా ఎస్​యూవీ కంట్రోల్​ తప్పింది. రోడ్డు మీద స్కిడ్​ అయి, పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

డోడా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ఐదుగురు ఆడాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయాలతో బయటపడ్డ బాధితుడి ఆరోగ్య పరిస్థితి సీరియస్​గా మారడంతో ప్రైవేటు ఆస్పత్రి నుంచి జమ్మూ మెడికల్​ కాలేజ్​ హాస్పిటల్​కు తరలించారు. మరో ఘటనలో రోడ్డు దాటుతుండగా ట్రక్​ ఢీ కొట్టడంతో ఏడో తరగతి పిల్లాడు  చనిపోయాడు. జమ్మూ శివార్లలో మిరాన్​ సాహిబ్​ ఏరియాలో  ట్రక్​ పడి సుమిత్​  అనే కుర్రాడు చనిపోయాడు.

16 dead as passenger vehicle falls into gorge in J&K's Doda