
భారత్లోకి రూ. 600 కోట్ల విలువైన డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్న పాక్ బోట్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ రహస్యంగా పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) జాయిట్ అపరేషన్ నిర్వహించింది.
Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024
డ్రగ్స్తో పాటు పాక్ నౌకలోని 14 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 600 కోట్ల విలువైన సుమారు 86 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ అపరేషన్ నిర్వహిస్తు్న్నామని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పాకిస్తానీ పడవ, దాని సిబ్బందితో పాటు తదుపరి విచారణ కోసం పోర్బందర్కు తరలించారు.