తెలంగాణలో కొత్తగా 1682 కేసులు..8 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1682 కేసులు..8 మంది మృతి

తెలంగాణలో శనివారం(ఆగస్టు17న) కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. నిన్న మరో 8 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 711కి చేరింది.  నిన్న ఒక్కరోజే 2070 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  72,202 కు చేరింది. ఇంకా 21,024 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.14,110 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.  ఇండియాలో కరోనా రికవరీ రేటు 72.51 ఉండగా.. తెలంగాణలో 76.86 గా ఉంది.

నిన్న  నమోదైన  కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 235 ,రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ 107,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.

గాడిద పాలు లీటర్ ధర రూ. 7000