వికారాబాద్ జిల్లాలో పిచ్చి కుక్క దాడిలో 17 మందికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో పిచ్చి కుక్క దాడిలో 17 మందికి గాయాలు
  • వికారాబాద్ జిల్లా రేగడి మైలారంలో ఘటన

వికారాబాద్, వెలుగు : పిచ్చి కుక్క దాడిలో 17 మందికి గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా రేగడి మైలారం గ్రామంలో జరిగింది. బొంరాస్ పేట మండలం రేగడి మైలారం గ్రామంలో గురువారం ఉదయం 8.30 గంటలకు స్కూల్ కు వెళ్తున్న చిన్నారులతో పాటు మరికొందరిపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. దాడిలో గాయపడ్డ వారిలో 15 మంది చిన్నారులున్నారు.

 గ్రామస్తులను కుక్కను ఊరి నుంచి బయటికి తరిమేశారు. గాయపడ్డ వారిని కొడంగల్ ప్రభుత్వాసుత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను హైదరాబాద్ కు తరలించామని డాక్టర్లు తెలిపారు. రేగడి మైలారం గ్రామంలో కుక్కల బెడద ఉందని.. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.