గచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్.. KTR కొడుకును పరామర్శ..సర్జరీ చేయించుకున్న హిమాన్షు

గచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్.. KTR కొడుకును పరామర్శ..సర్జరీ చేయించుకున్న హిమాన్షు

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల జిమ్​లో వర్కవుట్​చేస్తుండగా కేటీఆర్​ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ముక్కుకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో హిమాన్షుకు భవిష్యత్తులో శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు గచ్చిబౌలి ఏఐజీ దవాఖాన డాక్టర్లు సర్జరీ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ సీఎం, హిమాన్షు తాత కేసీఆర్​గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లి తన మనవడిని పరామర్శించారు.