మారుతి సుజుకి తన ఆటో గ్రీన్ మిషన్ లో భాగంగా భారత్ లో తొలిసారిగా S-CNG ఆటోమేటిక్ వెర్షన్లను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ డిజైర్,బాలెనో ,మోడళ్లలో ఈ 5-స్పీడ్ ఆటో గేర్ షిఫ్ట్ సాంకేతికతను జోడించింది.
మారుతి సుజుకి తన పాపులర్ మోడల్స్ స్విఫ్ట్, డిజైర్, బాలెనో ఆటోమేటిక్ ఎస్-సీఎన్జీ వెర్షన్లను శుక్రవారం విడుదల చేసింది. వీటిలో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్, క్లచ్ లెస్ టెక్నాలజీలను ప్రవేశపెట్టింది. స్విఫ్ట్ ఎక్స్షోరూం ధర రూ. 7.29 లక్షలు కాగా, డిజైర్ ధర రూ. 8.53 లక్షలు ఉంటుంది.
బాలెనో ఎక్స్షోరూమ్ రేటు రూ.8.32 లక్షలు. ఈ మూడింట్లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కిలో సీఎన్జీకి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. ఎస్–సీఎన్జీ టెక్నాలజీ వల్ల ఇంజన్కు మరింత గాలి, గ్యాస్ అందుతాయని, ఫలితంగా ఎక్కువ శక్తి, మైలేజ్ పొందవచ్చని మారుతి తెలిపింది.
