భారతదేశంలో కరోనా వైరస్ పీడ విరగడం కావడం లేదు. ఎక్కువ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. మరోసారి వైరస్ భూతం విరుచుకపడుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 20 వేల 528 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 49 మంది వైరస్ సోకి మరణించారు. మొత్తం 5,25,709 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,449గా ఉంది. ఇప్పటి వరకు 4,30,81,441 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 1,99,98,89,097 మందికి వ్యాక్సినేషన్ పంపిణీ జరిగింది.
COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449
— ANI (@ANI) July 17, 2022
199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd