మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎగ్జామ్ పేపర్ లీకులను అరికట్టలేకపోయాయి..బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ లీకులు సర్కార్ అని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత దీప్కే తీవ్రంగా విమర్శించారు. లీకులు లేకుండా ఏ చిన్న ఎగ్జామ్ కూడా బీజేపీప్రభుత్వం నిర్వహించలేవని రుజువైందని.. పోటీ నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. బీజేపీ సాధించిదల్లా రాజకీయ పార్టీలను విడగొట్టడం, ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభ పెట్టడమే అభిజిత్ దీప్కే అన్నారు.
శనివారం మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే.. రేపు అంటే జూన్ 28న ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉండగా ఒకరోజు ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే నీట్ పేపర్, సీబీఎస్ ఈకి సంబంధించి కేంద్రప్రభుత్వం, విద్యాశాఖ వైఫల్యాలు ఒక్కొక్కటి బయటికి వచ్చాయి. తాజాగా టీచర్ నియమాక పరీక్షల పేపర్లు కూడా లీక్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
The TET paper leak in Maharashtra proves that the BJP govt can’t conduct even a single exam.
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 27, 2026
All they can do is break political parties and poach MLAs and MPs. pic.twitter.com/pv7yI3C9cJ
