తెలంగాణలో కొత్తగా 2072 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 2072 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో మరో 2072 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,89,283కు చేరింది. మరో 9 మంది కరోనాతో చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1116 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2259 మంది డిశ్చార్జ్ అయ్యారు.వీటితో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,58,690 కు చేరింది. ఇంకా 29,477 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 54,308 టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 28 వరకు కరోనా టెస్టుల సంఖ్య 29,40,642 కు చేరింది.

నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా 283, రంగారెడ్డి 161, మేడ్చల్ మల్కాజ్ గిరి 160, నల్గొండ 139, కరీంనగర్ లో 109 కేసులు నమోదయ్యాయి.

కరోనాతో సస్తుంటే.. నీకు ఇల్లు కావాల్నా