దారుణం: ఎంగేజ్‌‌మెంట్ పార్టీ పేరుతో పిలిచి మహిళపై గ్యాంగ్‌‌రేప్

దారుణం: ఎంగేజ్‌‌మెంట్ పార్టీ పేరుతో పిలిచి మహిళపై గ్యాంగ్‌‌రేప్

ముంబై: హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్‌‌రేప్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడ్డారు. ఎంగేజ్‌‌మెంట్ పార్టీ పేరుతో ముంబైలోని అంధేరి-కుర్లా రోడ్‌లోని హోటల్‌‌కు సదరు బాధితురాల్ని పిలిచారు.

సదరు హోటల్‌‌కు మహిళ చేరుకున్నాక ఆమెను లైంగికంగా వేధించారు. బాధితురాలికి బలవంతంగా ఆల్కహాల్ తాగించారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంప్లయింట్ నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అవినాశ్ పాంగేకర్ (28), శిశిర్ (27), తేజస్ (25)గా గుర్తించారు. బాధితురాల్ని మెడికల్ టెస్టుల నిమిత్తం కూపర్ ఆస్పత్రిలో చేర్పించామని సాహర్ పోలీస్ స్టేషన్ అధికారి పేర్కొన్నారు.