వ్యాక్సిన్‌‌ వేయించుకొని ఇప్పటికి 27 మంది మృతి

వ్యాక్సిన్‌‌ వేయించుకొని ఇప్పటికి 27 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశామనే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 84,800 మందికి టీకా వేశామని అందులో 27 మంది చనిపోయారని తెలిపింది. గత 24 గంటల్లో వ్యాక్సినేషన్ చేసిన వారిలో ముగ్గురు చనిపోయారని స్పష్టం చేసింది. అయితే ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో మరీ చింతించేంతగా ఘటనలు జరగలేదని పేర్కొంది. తొలి వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న వారికి శనివారం నుంచి రెండో డోసును వేస్తున్నామని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ డోసు వేసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రెండో డోసు వేస్తున్నామని వివరించారు.