మత్స్యకారులకు చిక్కిన 30 కిలోల చేప

మత్స్యకారులకు చిక్కిన 30 కిలోల  చేప

నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయానికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 30 కిలోల బరువున్న బొచ్చ చేప వలకు చిక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులోని అలీసాగర్ జలాశయానికి  చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ చేప దొరికింది. సాధారణంగా చెరువులో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు పెరుగుతాయి. కానీ 30 కిలోల చేప దొరకడంతో వారు సంతోషపడుతున్నారు.