అడ్లూరి లక్ష్మణ్​ అనే నేను..మంత్రిగా ప్రమాణ స్వీకారం

అడ్లూరి లక్ష్మణ్​ అనే నేను..మంత్రిగా ప్రమాణ స్వీకారం

అడ్లూరి లక్ష్మణ్ అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అడ్లూరి లక్ష్మణ్ తో.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి   కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్​..  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపైనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గం నుండి తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో అనుహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది.ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జాక్‌పాట్ దక్కించుకుంటున్నారు.