
గద్వాల, వెలుగు: జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని సీఐఎల్ ప్రైవేట్ లిమిటెడ్ యూరియా గోడౌన్ ను తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నిల్వ ఉన్న ఎరువులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. యూరియా స్టాక్ ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు ప్రైవేట్ డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఏవో సక్రియా నాయక్, సంగీతలక్ష్మి, ఏవో ప్రతాప్ ఉన్నారు.
‘డబుల్’ ఇండ్లను ఓపెనింగ్ కు రెడీ చేయాలి
డబుల్ బెడ్రూం ఇండ్లను ఓపెనింగ్కు రెడీ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. తన ఛాంబర్ లో సంబంధిత ఆఫీసర్లతో ‘డబుల్’ ఇండ్ల పెండింగ్ పనులపై రివ్యూ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఇండ్ల ప్రారంభోత్సవం చేసేలా పనులన్నీ వారం రోజుల్లో కంప్లీట్ చేసి, సౌలతులు కల్పించాలన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరోసారి పరిశీలించి శాంక్షన్ లెటర్లను సిద్ధం చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, పీడీ శ్రీనివాసరావు, డీఈ కాశీనాథ్, పీఆర్ ఈఈ దామోదర్, విద్యుత్ శాఖ డీఈ తిరుమలరావు, మున్సిపల్ కమిషనర్ దశరథం ఉన్నారు