టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఏలో భారత్ తన రెండో మ్యాచ్ను నమీబియాతో ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్తో టీమిండియా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. దీంతో.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరు మీద ఉండేది. 2014లో ఐర్లాండ్తో మ్యాచ్లో నెదర్లాండ్స్ కేవలం 7 ఓవర్లలో 100 రన్స్ చేయగా.. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించేసింది.
6️⃣6️⃣6️⃣6️⃣4️⃣
— Star Sports (@StarSportsIndia) February 12, 2026
Ishan Kishan brings up the 4th-fastest fifty for India in the ICC Men's T20 World Cup in just 20 balls! 🔥
UNREAL HITTING UNDERWAY 💪
ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/AAhjg4fhuN
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో.. కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు, తిలక్ వర్మతో కలిసి సెకండ్ వికెట్కు జస్ట్ 31 బంతుల్లోనే 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు.
ప్రస్తుతం ఈ టీ20 ప్రపంచకప్లో భారత్కు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ -బ్యాటర్గా ఉన్న ఇషాన్ కిషన్.. బ్యాటింగ్లో తన అద్బుతమైన ఫామ్తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి నమీబియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. నమీబియా జట్టు ఈ టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో.. 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్తో క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. హార్డ్ హిట్టింగ్ షాట్స్తో పాటు రికార్డులను ఈ ఒకే మ్యాచ్తో టీమిండియా తిరగరాసింది.
