మంచిర్యాల, వెలుగు: త్వరలో నిర్వహించే పోలీస్కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు హాజరయ్యే అభ్యర్థులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ నిర్వహించనున్నట్టు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఈ నెల 20న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీతో కోచింగ్ ప్రారంభిస్తామన్నారు.
స్థానిక టీటీడీ ఫంక్షన్హాల్లో నిర్వహించే కోచింగ్ రెండు నెలలు కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అవసరమైన స్టడీ మెటీరియల్ఫ్రీగా అందిస్తామని తెలిపారు. దరఖాస్తుల కోసం క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశామని, స్కాన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
