అన్నమయ్య జిల్లాలో 48 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. నలుగురి అరెస్ట్​..

అన్నమయ్య జిల్లాలో 48 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. నలుగురి అరెస్ట్​..

అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో  48  ఎర్రచందనం దుంగలతో ఒక బైక్​ను  పోలీసులు  స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్​ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు..  టాస్క్ ఫోర్స్ ఎస్పీ   పీ. శ్రీనివాస్  ఆదేశాలతో డీఎస్పీ   జి. బాలిరెడ్డి ,  ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్  అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.    

టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది  ఈ రోజు ( జూన్​ 8) ఆదివారం తెల్లవారుజామున  బురకాయల కోట అటవీ ప్రాంతంలో స్థానిక అటవీ అధికారులు జయప్రసాదరావు, మోహన్ రెడ్డి, షబీన్ తాజ్ ల సహకారం తో వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల తనిఖీ చేపట్టారు.  అన్నగారి పల్లి సమీపంలోని వంకగట్టు  దగ్గర ఒక మోటారు సైకిల్ కనిపించింది.  అక్కడ గుమికూడి ఉన్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. ఆప్రాంతంలో తనిఖీ చేయగా అక్కడ 48 ఎర్రచందనం దుంగలు లభించాయి.పట్టుబడిన వారు  అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.  సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

►ALSO READ | అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తం.. రెండు గ్రామాల మధ్య ఘరణ..ఎందుకంటే..