ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలందుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాగా పనిచేస్తున్నారని, విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచించారు. యువత నుద్దేశంచి నారా లోకేష్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతి అభినందించారు.
అనంతపురం: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యామంత్రిగా లోకేష్ పనితీరు భేషుగ్గా ఉందని, శెహభాష్ లోకేష్ అని అభినందించారు. విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని రాష్ట్రపతి సూచించారు. యువతలో స్పూర్తి నింపేలా మంత్రి నారా లోకేష్ ప్రసంగించారని రాష్ట్రపతి అభినందించారు.
►ALSO READ | తిరుపతి జిల్లాలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
